ఒక పక్క కరోనా తీవ్రత అధికంగా ఉన్నా సరే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఎన్నికల ప్రచారం విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు. ఒక పక్క గవర్నర్లు అందరూ కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దు అని హెచ్చరించినా సరే ఆయన మాత్రం భారీ జన సమూహంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక దానికి సోషల్ మీడియాలో కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సైలెంట్ గా జనాలు వచ్చారు అని గతంలో కంటే ఈసారి బలంగా వచ్చారు అంటూ ట్రంప్ పోస్ట్ చేసారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
THE SILENT MAJORITY IS STRONGER THAN EVER BEFORE! #MAGA pic.twitter.com/AoIcroQUQd
— Donald J. trump (@realDonaldTrump) June 21, 2020