కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా ఆయన యోగా గురించి మాట్లాడుతూ కరోనా వైరస్ అనేది మన శ్వాస వ్యవస్థ మీద బలంగా దాడి చేస్తుందని చెప్పారు. దానిని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా యోగ అవసరం ఉందని యోగా మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు. 

 

ప్రజలు అందరూ కూడా తప్పకుండా యోగా చెయ్యాలి అని ఆయన సూచించారు. మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటే అది వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. మన రోగనిరోధక శక్తిని పెంచే మరియు జీవక్రియను మెరుగుపరిచే యోగా పద్ధతులు ఉన్నాయని అన్నారు. కరోనా కారణంగా యోగా అవసరాన్ని ప్రపంచం గుర్తించిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: