ప్రధాని గా నరేంద్ర మోడీ రెండో సారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న నేపధ్యంలో బిజెపి నేతలు  దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రుల నుంచి బిజెపి ఎంపీలు సీనియర్ నేతలు అందరూ కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక ఏపీలో కూడా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. దీనిపై రాష్ట్ర  పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ‘జన సంవాద్‌’ కార్యక్రమం ఏపీలో ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన. రాయలసీమ బీజేపీ కేడర్‌తో నిర్వహించే ఈ వర్చువల్‌ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశం ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: