అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా యోగా చేస్తున్నారు. సరిహద్దుల్లో సైనికుల నుంచి సిఎం ల వరకు అందరూ కూడా ఇప్పుడు యోగా లో మునిగితేలుతున్నారు. తాజాగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ తన నివాసం లో యోగా చేసారు. ఈ ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

ఇటీవల జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా కట్టడి నేపధ్యంలో ఆయన ఆఫీస్ కి వెళ్ళడం లేదు. ఇంటి నుంచే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు సిఎం. కాగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రికి కూడా కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: