సూపర్ స్టార్ రజిని కాంత్ నివాసంలో బాంబు పెట్టామని ఇటీవల ఒక ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. పోయేస్ గార్డెన్స్ లో ఉన్న ఆయన నివాసంలో  బాంబు పెట్టామని ఒక  వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనితో పోలీసు బలగాలు అప్రమత్తమై ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా ఎలాంటి బాంబు కూడా కనపడలేదు.

 

ఇక దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేయగా రజిని ఇంటికి ఫోన్ చేసింది ఒక 8 తరగతి బాలుడు అని పోలీసులు గుర్తించారు. కడలూర్ జిల్లాలోని నెల్లికుప్పంలో ఉండే ఎనిమిదో తరగతి విద్యార్థి ఫోన్ చేసాడు అని విచారణలో గుర్తించారు. బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేదు అని గుర్తించి పోలీసులు వదిలిపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: