కరోనా వ్యాక్సిన్... ఇప్పుడు ఏ దేశం చూసినా సరే దీని కోసమే ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తుందా అంటూ ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కరోనా వ్యాక్సిన్ విషయంలో కీలక ఆడుగులు పడుతున్నాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయం త‌యారు చేస్తున్న‌ కరోనా వ్యాక్సిన్ ఏజెడ్‌డీ 1222 ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది. 

 

ఈ టీకా ను ఎలా అయినా సరే సక్సెస్ చేసి ప్రపంచానికి అందించాలి అని యూరప్ లోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ త‌యారుచేస్తున్న ఈ టీకా ఇత‌ర టీకాల కంటే ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. కాగా భారత్ లో కరోనా డ్రగ్ తయారు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: