ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇంటి వద్దకు చేరాలనే లక్ష్యంతో జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పలు ప్రాంతాల్లో వాలంటీర్లు చేస్తున్న తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. మద్యం మత్తులో కర్ణాటకలోని పావగడ తాలుకా వెంకటాపురం గ్రామానికి చెందిన రైతుపై దాడి చేసిన గ్రామ వాలంటీర్లను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పెనుకొండ నియోజకవర్గం చెరుకూరుకు చెందిన గ్రామ వాలంటీర్లు స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం కొంతమందితో కలిసి రవి అనే రైతు పొలంలో విందు ఏర్పాటు చేసుకున్నారు. రైతు పొలంలో విందు ఏర్పాటు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాలంటీర్లు దాడి చేశారు. రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వాలంటీర్లతో పాటు వారి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: