గత కొంతకాలంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీపై, నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రఘురామ కృష్ణంరాజు వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన వైసీపీ నేతలు, కార్యకర్తలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. లేఖలో తన దిష్టి బొమ్మలు దహనం చేసి... తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. 
 
నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ ఎస్పీని కోరారు. ఎంపీ ఎవరెవరిపై ఫిర్యాదు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు సీఎం జగన్ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: