సిఎం హోదా వచ్చింది ఇక ప్రత్యేక హోదా ఎందుకు అని అనుకుంటున్నారా అంటూ సిఎం వైఎస్ జగన్ ని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. నాడు కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు కేంద్రం ముందు కనీసం తన మెడలు ఎత్తి హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆరోపించారు. 

 

వైసీపీ ఎంపిల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటని ఆయన నిలదీశారు. తాను ముఖ్య మంత్రి అవ్వడం కోసం ప్రతిపక్షంలో ఉన్నపుడు  ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా అన్ని విధాలుగా  వాడుకున్న జగన్ సీఎం అయ్యాక హోదాని పూర్తిగా మర్చిపోయారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ముఖ్య మంత్రి హోదా వచ్చింది..ఇక రాస్ట్రానికి ప్రత్యేక  హోదా వస్తే ఎంటీ, రాకపోతే నాకేంటి అన్నట్లు జగన్ వ్యహరించటం సిగ్గు చేటు అంటూ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: