అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం ఖాయమని శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ ఓడిపోతే అప్పుడు ప్రధాని మోదీ ఒంటరవుతారని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు ఇరుగు పొరుగు దేశాలన్నీ చైనాతో జతకడతాయని ఈ సందర్భంగా రౌత్ వ్యాఖ్యలు చేసారు. దేశ దౌత్య విధానం విఫలమైనందునే చైనా అంతటి అఘాయిత్యానికి పాల్పడిందని సామ్నాలో ఆయన కథనం రాసారు.

 

భారత సరిహద్దులు ఘర్షణాత్మక ప్రాంతాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యలు చేసారు. మన ఇరుగు పొరుగు దేశాలన్నీ చైనా వైపే నిలుస్తున్నాయన్నారు ఆయన. మన విదేశాంగ విధానం విఫలం కావడం వల్లే ఈ దుస్థితి వచ్చింది అంటూ రౌత్ వ్యాఖ్యలు చేసారు. కాగా ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: