అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొందరు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ యోగాసనాలను ప్రదర్శిస్తున్నారు. హీరోలు హీరోయిన్ లు అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. తాము ఇంట్లో ఏ విధంగా యోగా చేసాం అనేది సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. 

 

తాజాగా మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియాలో తన కుమార్తె విద్యా నిర్వాన తో కలిసి చేసిన యోగా ఫోటోలను షేర్ చేసారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మోహన్ బాబు కూడా యోగా చేసారు. యోగా గురించి ఆయన ఉదయం కీలక వ్యాఖ్యలు చేసారు. యోగా అనేది మన పూర్వికులు మనకు ఇచ్చిన మంచి వరం అంటూ ఆయన కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: