అతనో మహా మాయగాడు. అపరిచిత మహిళలతో మొదట పరిచయం పెంచుకుంటాడు. అనంతరం వారికి సైనేడ్ ఇచ్చి దారుణంగా హత్య చేస్తాడు. ఇలా ఏకంగా 20 మందిని చంపిన సీరియల్ కిల్లర్ కు ఈ నెల 24న శిక్ష పడనుంది. 2009లో కర్ణాటక రాష్ట్రంలోని కాసరగోడ్‌ ప్రాంతంలో లేడీస్‌ హాస్టల్‌లో పని చేసే 25 ఏండ్ల యువతితో మోహన్ పరిచయం ‌ పెంచుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. ఒకరోజు బెంగళూర్‌కు తీసుకెళ్లి అదేసమయంలో కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా తమకు వివాహం జరిగిందని చెప్పాడు. 
 
అనంతరం యువతికి లాడ్జీకి తీసుకెళ్లి శారీరకంగా అనుభవించి మరుసటి రోజు నగలను గదిలోనే పెట్టమని చెప్పి వేరే చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ గర్భనిరోధక మాత్ర అని చెప్పి సైనేడ్‌ కూర్చిన మాత్ర మింగించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం ఇదే తరహా కేసులో పోలీసులు మోహన్ ను అరెస్ట్ చేసి విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: