మహారాష్ట్రలో కరోనా వైరస్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర పోలీస్ శాఖను కరోనా ప్రత్యేకంగా టార్గెట్ చేసింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి పోలీసులు. నేడు ఒక్క రోజే అక్కడ 88 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇక ఒక పోలీస్ కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక మొత్తం కరోనా సోకిన పోలీసుల సంఖ్య అక్కడ నాలుగు వేలు దాటింది. అదే విధంగా దాదాపు 8౦ మంది వరకు కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పరిస్థితి రోజు రోజు కి భయంకరంగా మారుతుంది. ఇక డీజీపీ ఆఫీస్ లో కూడా కరోనా కేసులు భారీగా బయటపడ్డాయి. కీలక అధికారులు కరోనా బారిన పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: