వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నియోజకవర్గానికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో తన నియోజకవర్గానికి వెళ్ళాలంటే రక్షణ కావాలని... కేంద్రబలగాలతో రక్షణ కల్పిస్తేనే నియోజకవర్గానికి వెళ్ళగలుగుతానని ఆయన పేర్కొన్నారు. నన్ను బెస్ట్ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసారన్న ఆయన... ఈ రోజు కాకపోయినా రేపైనా నా నియోజకవర్గానికి వెళ్ళకతప్పదన్నారు.

 

బెదిరింపులకు పాల్పడుతున్నారనే స్పీకర్ లేఖ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు ఆయన. స్పీకర్‌కు ఇచ్చిన లేఖను నిబంధనల ప్రకారం బయటపెట్టలేనన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు మూడు రోజుల క్రితం లేఖ రాశానని చెప్పారు. అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు తన దిష్షిబొమ్మలు దహనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: