ఆంధ్రప్రదేశ్ లో జులై లో కేసులు పెరిగే అవకాశం ఉందా...? అంటే అవుననే అంటున్నారు  మంత్రి పెద్దిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో జులై లో కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆయన నిన్న మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో నేడు సిఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. 

 

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు జరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సిఎం కరోనా టెస్ట్ ల సంఖ్యను పెంచాలి అని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా కేంద్రానికి కూడా ఒక లేఖ రాసి... వైద్య బృందాలను కోరే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: