రాజధాని తరలింపు ఇప్పుడు కాదని కరోనా సంక్షోభం తర్వాత ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధాని తరలింపుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కరోనా సమస్య ముగిసిన వెంటనే రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి చెప్పటం తగదు అని ఆయన హెచ్చరించారు. 

 

అమరావతి రాజధాని అంశంపై విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్న ఆయన... మూడు రాజధానుల విషయాన్ని శాసన మండలి సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని మంత్రి పెద్దిరెద్ది చెప్పటం కోర్టు ధిక్కరణ కాదా? అని  ఆయన నిలదీశారు. అమరావతి రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: