చైనాలో ఘోర విషాదం జరిగింది. ఒక నదిలో 8 మంది స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని చోంగ్ కింగ్ నగరంలో నదిలో ఈత కొట్టడానికి అని 8 మంది విద్యార్ధులు వెళ్ళారు. వారు ప్రమాదవ శాత్తు అందులో మునిగి చనిపోయారు అని అధికారులు పేర్కొన్నారు. 

 

ఓ విద్యార్థి ఈత కొడుతూ నదిలో మునిగిపోతున్న సమయంలో... అతన్ని కాపాడేందుకు గానూ మిగిలిన ఏడుగురు విద్యార్థులు నదిలోకి దూకగా అందరూ కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నది లో నుంచి 8 మంది మృతదేహాలను అధికారులు బయటకు తీసారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. వారు అందరూ కూడా ఒకే క్లాస్ విద్యార్ధులు అని అధికారులు పేర్కొన్నారు. అందరి ఇళ్ళు పక్క పక్కనే అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: