కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. గోవా లో కేసులు చాలా తక్కువగా ఉండటమే కాకుండా అసలు మరణాలు ఏమీ లేవు ఇప్పటి వరకు. అన్ని రాష్ట్రాల్లో మరణాలు ఉన్నా సరే అక్కడి వైద్య ఆరోగ్య శాఖ సమర్ధవంతంగా వ్యవహరించడం తో మరణాలు ఏమీ లేవు. ఇక అలాంటి గోవా లో ఒక మహిళ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. 

 

గోవా తన మొదటి కరోనా మరణాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్ రాణే. మోర్లెంకు చెందిన 85 ఏళ్ల మహిళ  కరోనా పాజిటివ్ రాగా ఆమె ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన వెల్లడించారు. తాము కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: