ఇటీవలి కాల౦లో హైదరాబాద్ లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో బ్రతికి ఉన్న మహిళ మరణించింది అని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దబీర్ పురా కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. 

 

అయితే పోలీసులు పాత బస్తీ కి చెందిన మహిళ కుటుంబానికి ఫోన్ లో సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఆస్పత్రికి వచ్చి చూడగా మహిళ బ్రతికే ఉంది. దీనితో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఇక గాంధీ ఆస్పత్రి సిబ్బంది మీద కూడా తీవ్ర విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: