ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక టీడీపీలో సోషల్ మీడియా విభాగం కూడా ఈ మధ్య కాలంలో కాస్త యాక్టివ్ గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా విభాగం విమర్శలు చేస్తుంది. తాజాగా ఒక అమ్మాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయగా దీనిని టీడీపీ ట్విట్టర్ పోస్ట్ చేసింది. 

 

“రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక కోసం ఆలోచిస్తాడు, ఒక దార్శనికుడు, వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. అలాంటి విజనరీ నేత చంద్రబాబు గారి ఆలోచనే పట్టిసీమ. నాడు "వట్టిసీమ" అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్ గారికి, నేడు అధికారంలో అదే "పట్టి"సీమ దిక్కు అయ్యింది.” అంటూ సదరు మహిళ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: