ఆంధ్రప్రదేశ్ లో శాసన సభా సమావేశాల పుణ్యమా అని ఇప్పుడు రాజధాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. టీడీపీ నేతలు, అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అమరావతి లో పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ పర్యటిస్తున్నారు. రాజధాని గ్రామమైన రాయపూడిలో ఆయన పర్యటిస్తున్నారు. 

 

శనివారం రాజధాని గ్రామం రాయపూడి లో నిర్మాణంలో ఉన్న ఇన్‌టెక్‌వెల్ పనులు, కరకట్ట రోడ్‌ ను మంత్రి బొత్సా పరిశీలించారు. బొత్స తో పాటుగా సీఆర్డీఏ కమిషనర్ వచ్చి వెళ్ళారు. దీనితో అసలు ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. ఇక తాజాగా మరోసారి ఆయన రాయపూడి లో పర్యటిస్తున్నారు. దీనితో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: