కేరళలో ఒక ఏనుగు ని కొందరు దుండగులు బాంబు పెట్టి చంపేసిన తర్వాత ఎక్కడ ఏనుగు మరణిస్తున్నా సరే ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్ర౦లో ఒక ఏనుగు మరణం సంచలనంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని  కోయంబత్తూర్ శివార్లలోని జంబుకాండి గ్రామంలో 12 ఏళ్ల మగ ఏనుగు ఈ రోజు మరణించిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. 

 

దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ... గత కొన్ని రోజుల నుండి, ఆ ఏనుగు నోటి గాయంతో బాధపడుతు౦దని పేర్కొన్నారు. ఏనుగుని కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: