ఇటీవల భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన దాడిలో చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చైనాకు చెందిన మొత్తం 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అని కాని చైనా మాత్రం లెక్కలు బయటకు చెప్పడం లేదని అంటున్నారు. దీనిపై అమెరికా నిఘా వర్గాలు దృష్టి సారించాయి. 

 

సరిహద్దుల్లో మరణించిన సైనికులను ఉపగ్రహా చిత్రాలకు కూడా దొరకకుండా చైనా జాగ్రత్త పడింది అని అమెరికా భావిస్తుంది. ఇక భారత్ తరుపున సైనికులు మరణించిన విషయాన్నీ మన సర్కార్ బయటపెట్టినా సరే అటు వైపు ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటంతో చైనా ఆర్మీ నిజాలను దాచింది అని అమెరికా భావిస్తుంది. కాగా మన సైనికులు 24 మంది మరణించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: