లాక్డౌన్ నేపథ్యంలో పెళ్లిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన అబ్బాయి, కర్నాటక బెంగళూరుకు చెందిన అమ్మాయి మధ్య ఫోన్లో పరిచయం కావడంతో వీరిద్దరు ప్రేమించు కున్నారు. చివరకు వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే గద్వాల్ జిల్లా బైరాపురానికి చెందిన బోయ రాముడు(21), గత కొంతకాలంగా ఫోన్లో పరిచయమైన బెంగుళూరుకు చెందిన ధనలక్ష్మి (22)తో ప్రేమలో పడ్డాడు.
వీరిద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణ జరగడంతో అది కాస్త ప్రేమగా మారి చివరకు పెళ్లి దాకా వెళ్లింది. అయితే యువతి యువకుడి కంటే యేడాది పెద్ద. ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ నెల 19న ఆ ప్రేమ జంట కర్నూల్ జిల్లాలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. వివాహమైన రెండు రోజుల అనంతరం భద్రత కోసం ప్రేమ జంట పోలీస్లను ఆశ్రయించారు.
యువతి తల్లితండ్రులు దాడికి పాల్పడకుండా రక్షించాలని పోలీస్స్టేషన్ను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. యువకుడి తల్లి అనుసూయమ్మ ఫిర్యాదు మేకు ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని ఏఎస్ఐ తెలిపారు.