ఇటీవల మున్సిపల్ కమీషనర్ ని దూషించిన విషయంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి మీద నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి ఆయన కనపడకుండా పోయారు అని తెలుస్తుంది. తాజాగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నారు అని గుర్తించారు. 

 

ఆయనను అరెస్ట్ చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఆయన మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు అని తెలుస్తుంది. ఇక హైకోర్ట్ లో కూడా ఆయన స్క్వాష్ పిటీషన్ ని దాఖలు చేసారు. ఆయనను ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: