ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ ని కలవనున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపధ్యంలో ఆయన గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ పై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. గవర్నర్ కి తాజా పరిస్థితి ని సిఎం వివరిస్తారు. 

 

ఇక అసెంబ్లీ లో ఆమోదం పొందిన బిల్లులతో పాటుగా మండలి లో జరిగిన వ్యవహారాన్ని కూడా ఆయనతో సిఎం చర్చిస్తారని సమాచారం. ఇక కొత్త ఎన్నికల కమీషనర్ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశ౦ ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సతీమణి భారతి తో కలిసి జగన్ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: