ఇటీవల తెలంగాణా ఆస్పత్రులపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో ఘటన చోటు చేసుకుంది. రిమ్స్‌లో ఆదివాసీ మహిళ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అసహనం వ్యక్తం చేసారు. సదరు మహిళ మృతిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆమె అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  

 

దీనితో జిల్లా వైద్యాధికారి ఈ ఘటనపై విచారణ మొదుపెట్టారు. ఈనెల 19న రిమ్స్‌లో చికిత్స  పొందుతూ ఆదివాసీ మహిళ జయశీల ప్రాణాలు కోల్పోయారు. ఆమె గర్భంతో ఉండటంతో గర్భం లో ఉన్న ఇద్దరు కవల పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తెలంగాణాలో దుమారం రేగిన నేపధ్యంలో గవర్నర్ కూడా స్పందించి విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: