దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి ఉగ్రవాదుల ముప్పు ఉందని... భారీ విధ్వంసం పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై పోయారు. దేశ రాజధాని ఢిల్లీలోని భద్రతను ఒక్కసారిగా కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉంది అంటూ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

 


 అయితే భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న ఘర్షణ  వాతవరణాన్ని  అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు భారత్లో ప్రవేశించేందుకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు,

మరింత సమాచారం తెలుసుకోండి: