ప్రస్తుతం కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా మరణాలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ మహమ్మారి వైరస్ కారణంగా భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కూడా మృత్యువాత పడుతున్నారు. కరోనా కాటుకు సౌదీ అరేబియాలో భారతీయుడు కన్నుమూశారు. ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన సునీల్ కుమార్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు వైద్య పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో చికిత్సపొందుతూ మరణించాడు సునీల్ కుమార్.