తెలంగాణా సిఎం కేసీఆర్ సూర్యాపేట చేరుకున్నారు. ఇటీవల చైనా దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు నివాసానికి చేరుకున్న ఆయన సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఇక వారికి 711 గజాల స్థలం తెలంగాణా సర్కార్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

 

అదే విధంగా 5 కోట్ల చెక్ ని కూడా సిఎం కేసీఆర్ అందించారు. ఇక సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనుంది తెలంగాణా సర్కార్. సంతోష్ బాబు తో పాటుగా మంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. సంతోష్ బాబు ఫోటో కి కేసీఆర్ నివాళులు అర్పించారు 5 కోట్ల చెక్ తో పాటుగా నివాస పత్రాలను అందించారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: