కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సిఎం కేసీఆర్ పరామర్శించారు. సూర్యాపేట వెళ్ళిన ఆయన సంతోష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన 5 కోట్ల చెక్ తో పాటుగా 711 గజాల నివాస స్థలం పత్రాలను కేసీఆర్ అందించారు. అదే విధంగా ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కూడా ఇచ్చారు కేసీఆర్. 

 

ఆయన తో పాటుగా మంత్రి  జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కేసీఆర్ కాసేపు మాట్లాడి అనంతరం సహాయం అందించారు. జూబ్లిహిల్స్ లో 711 గజాల స్థలం ఇచ్చింది తెలంగాణా సర్కార్. దీనిపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇచ్చిన మాట మీద కేసీఆర్ నిలబడ్డారు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: