తెలంగాణా కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఏపీలో భారీగా మద్యం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలి అని చూసినా సరే ఎక్కడో ఒక చోట నకిలీ మద్యం దొరుకుతూనే ఉంది. ప్రధానంగా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా  ఈ అక్రమ మద్యం తరలింపు జరుగుతుంది. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది సర్కార్. 

 

ఇక తాజాగా ఒక వాలంటీర్ మద్యం తరలిస్తూ దొరికిపోయాడు. కర్ణాటక మద్యం తరలిస్తూ గ్రామ వాలంటీర్ భాస్కర్ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం గసికవారిపల్లిలో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వాలంటీర్ భాస్కర్‌తో పాటు అతని స్నేహితుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 147 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: