ఇప్పుడు దేశంలో చైనా పేరు వింటే చాలు చాలా మందికి ఆగ్రహం తీవ్ర స్థాయిలో బయటకు వస్తుంది. చైనా సర్కార్ సరిహద్దుల్లో చేస్తున్న కార్యక్రమాలపై ఆగ్రహంగా ఉన్నారు ఇప్పుడు దేశ ప్రజలు అందరూ కూడా. చైనాకు బుద్ధి చెప్పాలి అని ఇప్పుడు సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇక తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. 

 

భారత సైనికులను చైనా ఆర్మీ చంపిన నేపధ్యంలో ప్రతీకారం తీర్చుకోవడానికి గానూ ఉత్తరప్రదేశ్ అలీఘర్ కి చెందిన ఒక 10 మంది పిల్లల బ్యాచ్ కవాతుగా సరిహద్దులకు బయల్దేరి వెళ్ళింది. దారిలో పోలీసులుఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా తాము చైనాకు ఒక గుణపాఠం చెప్పడానికి వెళ్తున్నామని అన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వెనక్కు పంపించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: