గాల్వాన్ ఘటనపై మాజీ ప్రధాని మన్మోహన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఘాటుగా స్పందించారు. భారత దేశానికి చెందిన వందల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు దయతో అప్పగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుండా 2010 -2013 మధ్య పొరుగు దేశం చేసిన 600 చొరబాట్లకు ఆయన అధ్యక్షత వహించారని  విమర్శించారు. 

 

చైనా విషయంలో కాంగ్రెస్ పదే పదే ప్రధాని మోదీని దుమ్మెత్తి పోస్తోందన్న ఆయన... మొదట జవాన్లను పదే పదే అవమానించడం, వారి శౌర్యాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్ మానుకోవాలని ఆయన సూచనలు చేసారు చైనాకు నిస్సహాయతతో 43,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ధారాదత్తం చేసిన పార్టీ నాయకుడని మన్మోహన్ పై విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: