ఉత్తరాఖండ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు అక్కడ భారీగా నమోదు అవుతున్నాయి. ముందు కేసులు తగ్గాయి అని భావించినా సరే ఇప్పుడు మాత్రం ఆగడం లేదు. 57 కొత్త కొత్త కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో నమోదు అయ్యాయి. 

 

11 మంది రోగులు అక్కడ కరోనా నుంచి గత 24 గంటల్లో పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య కేసుల సంఖ్య 2401 కు చేరుకుందని... వీటిలో 1511 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 27 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: