ఏపీలో 108 స్కాం పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఆరోపించారు.
రివర్స్ టెండరింగ్ లో భారీగా మిగిలిపోయింది అంటూ బిల్డప్ ఇస్తున్న వైఎస్ జగన్ గారు... ప్రభుత్వం,108లో ప్రజాధనం ఎందుకు వృధా అయ్యిందో చెప్పలేక టిడిపి నాయకుల్ని అరెస్ట్ చెయ్యాలని అనుకుంటుంది అని ఆరోపణలు చేసారు. టిడిపి నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులతో వైకాపా నేతల ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ మాఫియాల ఆగడాలు బయటకు రాకుండా చెయ్యాలనే జగన్ రెడ్డి గారి ప్రయత్నం ఫలించదని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
స్కామ్ చేసినోళ్ళని వదిలి, బయటపెట్టిన వాళ్ళని జైల్లో వెయ్యడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత!రివర్స్ టెండరింగ్ లో భారీగా మిగిలిపోయింది అంటూ బిల్డప్ ఇస్తున్న @ysjagan ప్రభుత్వం,108లో ప్రజాధనం ఎందుకు వృధా అయ్యిందో చెప్పలేక టిడిపి నాయకుల్ని అరెస్ట్చె య్యాలనుకుంటుంది(1/2)#108ScamInAP pic.twitter.com/3mlVHOJLNu
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 22, 2020