ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కరోనా కేసులు పెరుగుదల అదే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన చర్చించారు. దాదాపు 30 నిమిషాల పాటు జగన్ గవర్నర్ తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి అని సమాచారం. 

 

కేబినేట్ విస్తరణ విషయంలో కూడా జగన్ గవర్నర్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అదే విధంగా లాక్ డౌన్ మీద కూడా చర్చలు జరిగాయి అని సమాచారం. విజయవాడ సహా నాలుగు నగరాల్లో కరోనా కేసులపై జగన్... గవర్నర్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. కరోనా కట్టడిపై ఒక నివేదికను కూడా జగన్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: