ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో రెండు మంత్రి పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిపై సిఎం వైఎస్ జగన్ తాజాగా గవర్నర్ తో జరిగిన భేటీ లో చర్చించారు అని సమాచారం. కేబినేట్ లోకి ఎవరిని తీసుకునే అవకాశం ఉంది అనే దాని పై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
ఇక రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు సహా కరోనా పరిస్థితుల గురించి కూడా సిఎం జగన్ గవర్నర్ తో చర్చించారు. ఇక కరోనా కట్టడికి గవర్నర్ కూడా పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. 30 నిమిషాల పాటు గవర్నర్ తో జగన్ భేటి అయ్యారు. కాగా రెండు నెలల తర్వాతే కేబినేట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది.