దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. అక్కడ ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశం మాత్రం దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ లో మారుతి సుజుకీ లో పని చేసే ఉద్యోగులు భారీగా కరోనా బారిన పడుతున్నారు. 

 

దేశ రాజధాని నగరమైన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నగరంలోని మారుతీ సుజుకీ కార్ల ఫ్యాక్టరీలో పని చేస్తున్న 17 మందికి కరోనా సోకింది. అయితే ఆ 17 మంది కనపడకుండా పోయారు. వారు అందరూ గురుగ్రామ్, జజ్జార్ ప్రాంతాల్లో నివాసముంటున్నారని పోలీసులు గుర్తించారు. ఇక వారి కోసం ప్రత్యేకంగా ఒక క్వారంటైన్ కేంద్రం కూడా ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: