జమ్మూ కాశ్మీర్ లో ప్రతీ రోజు కూడా ఏదోక ప్రాంతంలో ఎన్కౌంటర్  జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరుగుతుంది ఆ ప్రాంతంలో. పుల్వామాలోని బాండ్‌జూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు మరియు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు అని  జమ్మూ & కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. 

 

ఇక ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి బలగాలు. ఇక వారి వద్ద నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. రెండు ఎకె -47 తుపాకులను మరి కొన్ని హ్యాండ్ గ్రెనేడ్ లను స్వాధీనం చేసుకున్నారు. మరి కొంత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపట్టామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: