ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు గన్ మెన్ లు కాస్త తల నొప్పిగా మారిపోయారు. గన్ మెన్ లకు కరోనా రావడం తో ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా భయపడుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్  ఎమ్మెల్యేల గన్ మెన్ లకు కొందరికి కరోనా సోకింది. అదే విధంగా బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మెన్ కి కూడా కరోనా సోకింది. 

 

ఇక ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే  గన్ మెన్ ఏకంగా కరోనాతో మరణించారు. అలాగే మరి కొందరు గన్ మెన్ లకు కూడా కరోనా సోకింది. ఇక ఇప్పుడు విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు కి కూడా కరోనా సోకింది. ఆయన గన్ మెన్ నుంచి ఆయనకు కరోనా వచ్చింది అని అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: