ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది గాని తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే దాని పని అది చేయడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక కరోనా కట్టడికి చాలా విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. 

 

ఈ నేపధ్యంలోనే ఏపీ లో పలు పరీక్షలను రాష్ట్ర సర్కార్ రద్దు  చేస్తుంది. పదో తరగతి పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు డిగ్రీ పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే దానిపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: