కొన్ని షరతులతో పూరి జగన్నాథ్ యాత్రకు సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పలువురు హిందుత్వ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు భక్తులకు. జగన్నాథుని రథయాత్ర శుభ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు. 

 

భక్తితో నిండిన ఈ ప్రయాణం దేశ వాసుల జీవితాలకు ఆనందం, శ్రేయస్సు, అదృష్టం మరియు ఆరోగ్యాన్ని ఇస్తుందని నేను కోరుకుంటున్నానని మోడీ వ్యాఖ్యానించారు. ఇక నిన్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కూడా దీనిపై దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఓడిశా సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు లేకుండానే యాత్రను నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: