కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడం శుభపరిణామం అన్న విషయం తెలిసిందే. ఇటీవలే రెండు ఫార్మ కంపెనీలు కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నామని చెప్పగా... కరోనా వైరస్ నివారణ కు ఆయుర్వేదిక మందులు కూడా కనుగొన్నట్లు బాబా రాందేవ్ తెలిపారు.
కరోనా వైరస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ హరిద్వార్ లోని పతంజలి యోగ్పీత్ లో రాందేవ్ బాబా తాజాగా ప్రారంభించారు. ఈ పరిశోధనను పతాంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హరిద్వార్ మరియు జైపూర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంయుక్తంగా చేసినట్లు బాబా రాందేవ్ తెలిపారు. ప్రస్తుతం మీడియా సమక్షంలో కరోనా వైరస్ కు ఆయుర్వేదిక మందును ప్రారంభించారు బాబా రాందేవ్.