ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక లేఖ రాసారు. ఈ లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పెట్రోల్ ధరల పెంపుపై ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సుంకాన్ని రద్దు చేసి పెట్రోల్ ధరలు తగ్గించాలని సిఎం కి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేసారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను వరుసగా 16వ రోజు కూడా పెంచిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. 

 

కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తున్నందున పెట్రో ధరలు తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేసారు. ధరల పెరుగుదలతో రాష్ట్ర రవాణా రంగంపై దాదాపు రు.3,900 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: