ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ఇప్పుడు బస్సు సర్వీసుల కోసం జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ బస్సులు ఎప్పుడునడుస్తాయి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. రెండు నగరాల్లో కూడా కరోనా తీవ్రత చాలా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. 

 

ఈ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు రేపు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై రేపు నిర్ణయం తీసుకుంటారు. గత వారం విజయవాడలో సమావేశం అయినా సరే ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనితో రేపటి సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: