ఇండియా నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలకు అమెరికా నిషేధం విధించింది. కరోనా వైరస్ ముసుగులో భారతీయులతో పాటు పబ్లిక్ వ్యక్తులకు టికెట్ అమ్ముతున్నారు అనే ఆరోపణలతో.. అమెరికా దేశ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ విమానాల టికెట్లు అక్రమంగా అమ్ముతున్నారు అంటూ అమెరికా ఆరోపణలు చేసింది. అంతేకాకుండా కరోనా కారణం చూపుతూ అమెరికన్ ఎయిర్ లైన్స్ ఇండియాకు రావడంపై అటు ఇండియా కూడా నిషేధం విధించింది. దీంతో తమ ఎయిర్లైన్స్ ఆర్థికంగా నష్టపోతున్నారని అమెరికన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది.