దేశంలో గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది దక్షినాది రాష్ట్రాలను కూడా వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల గుంటూరు ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూకంపాలు వచ్చాయి. ఇక తాజాగా కృష్ణా, నల్గొండ జిల్లాల్లో భూకంపం సంభవించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల, నల్గొండ జిల్లా మేళ్లచెరువు, చింతలపాలెంలలో భూమి కంపించింది. 

 

ఇక ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ప్రతీ రెండు మూడు రోజులకు ఒకసారి భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. మొన్నా నిన్నా మిజోరం లో వరుసగా భూకంపాలు సంభవించాయి. అలాగే ఇటీవల అస్సాం లో కూడా వరుస భూకంపాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: