కరోనా కేసులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్  ఉత్తరాఖండ్ ముందు ఉంటాయి. అలాంటి రాష్ట్రాలు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అసలు పది లోపే ప్రతీ రోజు కేసులు నమోదు అయ్యేవి. ఆ తర్వాత అవి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి అక్కడ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు 29  మందికి కరోనా సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 756 కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అక్కడ కరోనా మరణాలు చాలా వరకు తక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే.  ఇక రికవరీ రేటు కూడా భారీగా ఉంది. దాదాపు అక్కడ 550 మందికి పైగా కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: