ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ కాస్త దూకుడుగా వెళ్తుంది. అంతర్జాతీయ ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు వరుసగా కాల్పులకు దిగుతుంది. తాజాగా నలుగురు ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ కాల్చి చంపిందని అక్కడి ఆర్మీ అధికారులు వెల్లడించారు. లాహోర్ లో జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి బలగాలు. 

 

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న కాల్పుల్లో ఉగ్రవాదులను కాల్చి చంపామని అక్కడి బలగాలు వెల్లడించాయి. మత్తానీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారంతో కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ) ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ ఆపరేషన్ లో ఆర్మీ ని చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఎదురు కాల్పులు మొదలు అయ్యాయి. దీనితో నలుగురు ఉగ్రవాదులు ఈ కాల్పుల్లో మరణించారని ఆర్మీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: